ఓటుకు నోటు కేసు..సండ్రకు నిరాశ

Update: 2020-12-08 15:15 GMT

తెలంగాణలో కలకలం రేపిన ఓటుకు నోటు కేసు నుంచి తనను తప్పించాలని కోరుతూ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వేసిన డిశ్చార్జ్ పిటీషన్ ను హైకోర్టు కొట్టేసింది. అదే సమయంలో ఏసీబీ కోర్టులో ఈ కేసుపై విచారణ సాగింది. కేసు విచారణకు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహా గైర్హాజరు అయ్యారు. ఈనెల 15న ఖచ్చితంగా హాజరు కావాలని నిందితులందరికీ ఏసీబీ కోర్టు ఆదేశించింది. హాజరు మినహాయింపు కోసం పిటిషన్లను అనుమతించమని కోర్టు స్పష్టం చేసింది.

Tags:    

Similar News