గతంలో కాంగ్రెస్ అధిష్ఠానం..ముఖ్యంగా లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ల మధ్య గ్యాప్ బాగా ఉంది అన్న ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం అంతా బాగానే సెట్ అయినట్లు ఉంది అనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది. ఈ కారణంగానే ఎంతో మంది రేస్ లో ఉన్నా కూడా వీళ్ళు అందరిని పక్కన పెట్టి వేం నరేందర్ రెడ్డి కి రాజ్య సభ ఛాన్స్ ఇచ్చినట్లు చెపుతున్నారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే కాంగ్రెస్ కు ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకునే బలం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 66 మంది అయితే...సిపిఐ అభ్యర్థి ని కలుపుకుంటే ఈ బలం 67 మాత్రమే. అయితే బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి దూకిన ఎమ్మెల్యేలతో పాటు ప్రస్తుతానికి కాంగ్రెస్ మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఎంఐఎం వంటి పార్టీల మద్దతుతో కాంగ్రెస్ రెండవ సీటు ను దక్కించుకునే పనిలో ఉంది. అందుకే అధిష్టానం కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పేరుకే ఓకే చేసింది అనే చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. మార్చి 5 నామినేషన్స్ దాఖలుకు లాస్ట్ డేట్ కాగా..ఎన్ని అనివార్యం అయితే మార్చి 16 న పోలింగ్ నిర్వహిస్తారు.