కెసిఆర్ కు సిట్ నోటీసులు

Update: 2026-01-29 08:55 GMT

తెలంగాణలో బిఆర్ఎస్ హయాంలో సాగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో విచారణ క్లైమాక్స్ కు వచ్చినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే ఇదే కేసులో బిఆర్ఎస్ కీలక నేతలుగా ఉన్న కేటీఆర్ తో పాటు హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావు లను ఇప్పటికే సిట్ విచారించిన సంగతి తెలిసిందే. బిఆర్ఎస్ హయాంలో సాగిన టెలిఫోన్ ట్యాపింగ్ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలనం శ్రీష్టించింది. ఈ ట్యాపింగ్ ప్రధానంగా రాజకీయ ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు ఉపయోగించుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీ నేతల ఫోన్లతో పాటు కొంత మంది జడ్జిల ఫోన్లు...మీడియా అధినేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశంపై కేసు కూడా నమోదు అయింది. ఈ అంశంలోఇప్పటికే కీలక నేతల విచారణలు పూర్తి కావటంతో ఇప్పుడు ఫైనల్ గా బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ విచారణకు రంగం సిద్ధం అయింది.

                                    Full Viewసిట్ అధికారులు దీని కోసం గురువారం నాడు మాజీ సీఎం కెసిఆర్ కు నోటీసు లు ఇచ్చారు. హైదరాబాద్ లోని నంది నగర్ నివాసంలో ఈ నోటీసులు అందించారు. జనవరి 30 న అంటే శుక్రవారం నాడు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. అయితే కెసిఆర్ వయస్సు దృష్ట్యా ఆయన ఎక్కడ కోరుకుంటే అక్కడే విచారణ జరుపుతాం అని..అయితే ఇందుకు అనువైన ప్రాంతాన్ని విచారణ అధికారికి ముందస్తు సమాచారం ఇవ్వాలని నోటీసు లో ప్రస్తావించారు. బిఆర్ఎస్ హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబి) చీఫ్ గా పనిచేసిన టి. ప్రబాకర్ రావు ను ఇప్పటికే సిట్ అధికారులు పలు దఫాలు విచారించారు. ఆయన స్టేట్ మెంట్స్ కూడా నమోదు చేశారు. కెసిఆర్ ను సిట్ విచారించిన తర్వాత ఈ కేసు లో రేవంత్ రెడ్డి సర్కారు తదుపరి అడుగులు ఎలా ఉంటాయి అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తిరేపుతున్న అంశం.

Tags:    

Similar News