కొత్త మ‌లుపు మా వివాదం..పోలీసు కేసు

Update: 2021-10-17 11:38 GMT

'మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నిక‌ల సెగ‌లు ఇంకా ఆగ‌టం లేదు. తాజాగా ఈ వివాదం కొత్త మ‌లుపు తిరిగింది. ఏకంగా పోలీసు కేసు వ‌ర‌కూ వెళ్లింది. ఎన్నిక‌ల రోజు మోహన్ బాబు, న‌రేష్ బెదిరింపుల‌కు దిగార‌ని ప్ర‌కాష్ రాజ్ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల రోజు నాటి సీసీటీవీ ఫుటేజ్ కావాల‌ని ప్ర‌కాష్ రాజ్ ఎన్నిక‌ల అధికారికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన అధికారి సీసీటీవీ ఫుటేజీ ఇవ్వ‌టానికి అభ్యంత‌రం ఏమీ ఉండ‌ద‌ని తెలిపారు. అయితే ఇప్పుడు ఫుటేజ్ ఇవ్వ‌టం కుద‌రద‌ని ఎన్నిక‌ల అధికారి కృష్ణ మోహన్ స్ప‌ష్టం చేశారు. దీంతో ప్ర‌కాష్ రాజ్ పోలీసు కేసు పెట్టారు. ప్ర‌కాశ్ రాజ్ ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. తాజాగా సీసీ ఫుటేజ్ సర్వర్ రూమ్ కు తాళం వేశారు. ఎన్నిక‌ల రోజు నాటి సీసీటీవీ ఫుటేజ్ ను మాయం చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్ ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News