ఆర్జీవీతో జాగ్రత్త!

Update: 2020-12-20 11:59 GMT

వంద రోజులకుపైగా సాగిన బిగ్ బాస్ తెలుగు షో ఆదివారంతో ముగియనుంది. ఫైనల్ విజేత తేలేది కూడా నేడే. దీని కోసం మా టీవీ భారీ కార్యక్రమమే తలపెట్దింది. ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లు అందరూ వేదికపైకి వచ్చారు. ఈ సందర్భంగా ఓ సరదా సన్నివేశం ఒకటి చోటుచేసుకుంది. ఈ షోలో పాల్గొన్న స్వాతి దీక్షిత్ ఆర్జీవీతో ఓ ప్రాజెక్టు చేస్తున్నట్లు చెబుతుంది. వెంటనే అక్కినేని నాగార్జున సరదగా జాగ్రత్త అంటూ ఓ ఝలక్ ఇస్తారు. ప్రొమోలోనే ఈ విషయం చూపించారు.

ఈ సారి బిగ్ బాస్ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గంగవ్వ కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి నుంచి బయటకు పోయాక రోజుకు ఐదు వందల వరకూ వస్తున్నారని..ఇది తనకు ఓ పెద్ద సమస్యగా మారిందని వాపోయింది. అంతే కాదు..బిగ్ బాస్ హౌస్ లోకి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఎంట్రీ ఇచ్చారు. అంతే కాదు..ఫైనలిస్టులుగా ఉన్న వారి యాక్షన్స్ చేసి చూపించి మరీ అనిల్ రావిపూడి హంగామా చేశారు.

Full View

Tags:    

Similar News

అంతా రెడీ