ఎన్నికల ముందు కీలక పరిణామం

Update: 2024-05-05 16:11 GMT

Full Viewజగన్ సర్కారుకు బిగ్ షాక్. ఆంధ్ర ప్రదేశ్ డీజిపీ కె వి రాజేంద్రనాథ్ రెడ్డి పై బదిలీ వేటు పడింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఆదివారం నాడు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సరిగ్గా ఇంకో ఎనిమిది రోజుల్లో ఎన్నికలు ఉండగా ఇంత అకస్మాత్తుగా డీజీపీ ని బదిలీ చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవానికి టీడీపీ, జన సేన, బీజేపీ కూటమి ఎప్పటి నుంచో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తో పాటు డీజిపీ ని బదిలీ చేయాలని కోరుతున్నాయి. ఈ మేరకు పలుమార్లు ఫిర్యాదులు కూడా చేశాయి. వీళ్ళు ఇద్దరు అధికార వైసీపీ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని అని కూటమి పార్టీలు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నాయి.

                                               వాస్తవానికి ఆ పార్టీ లు ఇక బదిలీ ఉండదు అని భావిస్తున్న సమయంలో డీజీపీ పై వేటు పడటం కీలక పరిణామంగా చెప్పుకోవాలి. అయితే క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులపై క్లారిటీ వచ్చిన తర్వాతే బీజేపీ కూడా ఈ విషయంలో ఇప్పుడు వేగంగా ముందుకు కదిలింది అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఎన్నికలు తేదీ దగ్గర పడుతున్న కొద్ది ఫలితంపై రాజకీయ పార్టీలకు కూడా స్పష్టత వస్తుంది అని చర్చ సాగుతోంది. అధికార వైసీపీ ఇప్పటికే పలు అంశాలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుండగా ..ఇప్పుడు కొత్తగా తెరమీదకు వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఎన్నికల ముందు పెద్ద దుమారం రేపుతోంది. ఇది కూడా అధికార వైసీపీ కి నష్టం చేసే అవకాశం ఉంది అనే భయం అధికార పార్టీ అభ్యర్థులను వెంటాడుతోంది.

Tags:    

Similar News