పలువురిని విచారించిన అధికారులు.. కీలక ఆధారాలు సేకరించిన అనంతరం తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ లిక్కర్ స్కాం కు సంబంధించి సిట్ అధికారులకు విజయసాయిరెడ్డి కీలక సమాచారం అందించినట్లు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఒక సారి మీడియా సాక్షిగానే విజయసాయిరెడ్డి ఇందులో కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని వెల్లడించారు. తర్వాత ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి అత్యంత సన్నిహితంగా ఉన్న అధికారులు అయిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లను కూడా ఈ కేసు లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఇదే కేసు లో అరెస్ట్ అయి తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. మరో కీలక నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇదే కేసు లో ఇంకా జైలు లోనే ఉన్నారు. ఈడీ అధికారులు విజయసాయిరెడ్డి ని విచారించిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వైసీపీ హయాంలో సాగిన లిక్కర్ స్కాం లో వేల కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అధికార తెలుగు దేశం పార్టీ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది.