జగన్ ను 'సాక్షి భలే బుక్ చేసిందిగా '

Update: 2023-01-02 04:15 GMT

Full Viewఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇరకాటం లో పడ్డారు. అందుకు కారణం అయన ఫ్యామిలీకి చెందిన పత్రిక సాక్షి కావటం ఇక్కడ హై లైట్ గా చెప్పుకోవాలి. అది ఎలాగంటారా ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా అందరిలాగా సాక్షి క్యాలెండరు ను పేపర్ తో పాటు అందించింది. ఇది అంతా రొటీనేగా జరిగే వ్యవహారమే. అయితే ఈ క్యాలెండర్ల లో ఆయా రాష్ట్రాల్లో చోటుచేసుకున్న కీలక ప్రాజెక్టులతో పాటు పర్యాటక ప్రాంతాలను ప్రముఖంగా ముద్రించారు. తెలంగాణ క్యాలెండరు విషయానికి వస్తే తెలంగాణ సర్కారు..ముఖ్యమంత్రి కెసిఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా పునర్ నిర్మించిన యాదాద్రి దేవాలయం తో పాటు తెలంగాణ పోలీస్ ట్విన్ టవర్స్ , టి హబ్, పునరుద్ధరించిన మెట్ల బావి, తుది దశకు చేరుకున్న తెలంగాణ నూతన సచివాలయం, ఇతర మౌలిక వసతులతో పాటు రామప్ప, మెదక్ చర్చి వంటి చారిత్రిక ప్రదేశాలను కూడా క్యాలెండరు లో చోటు కల్పించారు. ఇది అంత బాగానే ఉంది ..ఎక్కడా తప్పు పెట్టాల్సింది లేదు. కానీ జగన్ పాలనలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే ఇదే సాక్షి క్యాలెండరు లో మాత్రం మొత్తం బొర్రా గుహలు, చంద్రగిరి కోట, వైజాగ్, అరకు వంటి ఫొటోలతో నింపేశారు. అంటే ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఏమీ చేయలేదు...అంటే క్యాలెండరు లో పెట్టే స్థాయి ఉన్న నిర్మాణాలు కానీ..ప్రాజెక్టులు ఏమీ లేవని ఈ క్యాలండర్ ద్వారా చెప్పకనే చెప్పారు.

                             ఇదే అదనుగా సోషల్ మీడియా లో ఈ రెండు క్యాలెండర్లను పక్క పక్కన పెట్టి రెండు రాష్టాలను పోల్చుతూ కామెంట్స్ చేస్తున్నారు. నల్లగొండకు చెందిన అశోక్ రెడ్డి ఇదే అంశంపై ట్వీట్ చేశారు. ఒక్క పేజీ క్యాలెండరు తో రెండు రాష్ట్రాల మధ్య వ్యత్యాసాన్ని చక్కగా చూపెట్టారు...ఇంత బాగా ఎవరూ చేయలేరు..సాక్షి టీం కు ధన్యవాదాలు అంటూ వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఈ మూడున్నర సంవత్సరాల్లో బటన్లు నొక్కటం తప్ప ఏమీ చేయలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.. అంతే కాదు..సొంత పార్టీ నేతలు కూడా కనీసం రోడ్ల గుంతల పూడ్చలేక పోతున్నాం..ప్రజలను ఎలా ఓట్లు అడగాలి అంటూ వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో సాక్షి క్యాలెండరు రూపంలో ప్రతిపక్షాలకు కూడా ఒక ఆయుధం దొరికినట్లు అయింది. చేసింది ఏమీ లేక...వేసుకోవటాని ఏమీ లేక క్యాలెండరు లో చారిత్రక ప్రదేశాల బొమ్మలతో సరిపెట్టారనే విమర్శలు రావటం పక్కా.

Tags:    

Similar News