పుష్పరాజ్ పాలనకు రంగం సిద్ధం

Update: 2024-08-28 14:51 GMT

పుష్ప 2 సినిమా కు సంబంధించి చిత్ర యూనిట్ మరో సారి క్లారిటీ ఇచ్చింది. అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ తో వంద రోజుల్లో పుష్పరాజ్ పాలన ఎలా ఉంటదో చూస్తారు అంటూ ఫ్యాన్స్ లో జోష్ నింపే ప్రయత్నం చేసింది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాపై రకరకాల పుకార్లు షికారు చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే దీనిపై దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ స్పష్టత ఇచ్చారు. ఇప్పుడు వంద రోజుల కౌంట్ డౌన్ కు శ్రీకారం చుడుతూ న్యూ లుక్ విడుదల చేశారు. ఇందులో అల్లు అర్జున్ వెరైటీ గా చేయి పైకెత్తిన ఫోటో ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకొంటోంది. వాస్తవానికి ఈ సినిమా ఆగస్ట్ 15 న విడుదల కావాల్సి ఉండగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పుష్ప 2 డిసెంబర్ ఆరు న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప సినిమా దేశ వ్యాప్తంగా ఎంత పెద్ద సంచలన విజయం దక్కించుకుందో అందరికి తెలిసిందే.

                                               దీంతో ఇప్పుడు పుష్ప 2 పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా వసూళ్ల విషయంలో కొత్త రికార్డు లు నమోదు చేసే అవకాశం ఉంది అనే చర్చ సాగుతోంది. మరో వైపు మెగా, అల్లు కుటుంబాల మధ్య తలెత్తిన వివాదం నిత్యం కొత్త కొత్త మలుపులు తీసుకొంటోంది. ఇది ఏమైనా సినిమాపై ప్రభావం చూపిస్తుందా..లేదా అన్నది వేచిచూడాల్సిందే. సినిమా కు మంచి టాక్ వస్తే మాత్రం పుష్ప 2 ను ఆపటం ఎవరి వల్ల కాదు అనే చర్చ కూడా మరో వైపు సాగుతోంది. పుష్ప 2 లో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఏకంగా పుష్ప 2 సినిమాని 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

Tags:    

Similar News