టాలీవుడ్ లో భారీ భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించే ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. ఈ సంస్థ ఉగాదికి విడుదల అయిన పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ వసూళ్ల వివరాలను ఎందుకు వెల్లడించటం లేదు. ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా శ్రీ లీల, రాశీ ఖన్నాలు నటించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. ప్రేక్షకులే కాదు...పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను కూడా ఇది ఆకట్టుకోలేకపోయింది అనే టాక్ నడుస్తోంది. దీనికి అనుగుణంగానే అన్నట్లు ఇప్పటి వరకు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటి వరకు ఒక్కటి అంటే ఒక్క రోజు కూడా ఈ సినిమా వసూళ్ల పోస్టర్ విడుదల చేయలేదు. దీంతో చిత్ర ఫలితంపై నిర్మాణ సంస్థ కూడా ఏ మాత్రం సంతృప్తికరంగా లేదు అనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో సాగుతోంది. పవన్ కళ్యాణ్ గత సినిమా ఓజీ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఎప్పటికప్పుడు ఓజీ వసూళ్లను వెల్లడించిన సంగతి తెలిసిందే.