శర్వానంద్, రష్మికల కొత్త సినిమా

Update: 2020-10-25 10:27 GMT

టాలీవుడ్ లో వరస సినిమాలో దూసుకెళుతున్న రష్మిక మందన ఇప్పుడు శర్వానంద్ తో జోడీ కడుతోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుంది. చెరుకూరి సుదాకర్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు. చిత్ర యూనిట్ దసరాను పురస్కరించుకుని ఆదివారం ఉదయం తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. దర్శనాంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. 'అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో తమ చిత్రానికి సంబంధించిన పూర్తివిశేషాలు వెల్లడిస్తామన్నారు.

Tags:    

Similar News