సర్కారువారి పాట షూటింగ్ పూర్తి

Update: 2022-04-22 14:16 GMT

మ‌హేష్‌బాబు, కీర్తిసురేష్ జంట‌గా న‌టిస్తున్న సినిమా స‌ర్కారు వారి పాట‌. క‌రోనా కార‌ణంగా ప‌లు మార్లు వాయిదా ప‌డిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మే12న విడుద‌ల కానుంది. తాజాగా చిత్ర యూనిట్ షూటింగ్ పూర్త‌యిన‌ట్లు అప్ డేట్ ఇచ్చింది. ఈ అప్ డేట్ తోపాటు మ‌హేష్ బాబు న్యూలుక్ ను కూడా విడుదల చేసింది. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించింది. శ‌నివారం నాడు ఈ సినిమాకు సంబంధించిన కొత్త పాట‌ను కూడా విడుద‌ల చేయ‌నున్నారు. త‌మ‌న్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. 

Tags:    

Similar News