రిపబ్లిక్ ట్రైలర్ విడుదల చేసిన చిరు

Update: 2021-09-22 05:50 GMT

Full Viewసాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1 న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి బుధవారం విడుదల చేసారు. ట్రైలర్ చూస్తే ఇందులో రాజకీయ నేతలు, అధికారుల మధ్య జరిగే సంఘర్షణ చూపెట్టనట్లు కన్పిస్తోంది. రమ్య కృష్ణ రాజకీయ నేతగా , సాయి ధరమ్ తేజ్ కలెక్టర్ గా కనిపించనున్నారు. ట్రైలర్ లో డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

ట్రైలర్ విడుదల చేస్తూ చిరు ఒక ట్వీట్ చేసారు. 'సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1 వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష.' అని పేర్కొన్నారు. 

Tags:    

Similar News