ఆ జాబితాలోకి మెగా హీరో

Update: 2024-09-29 09:24 GMT

ప్రతిష్టాత్మక మేడం టుస్సాడ్స్ లో ఏర్పాటు అయిన విగ్రహం టాలీవుడ్ నుంచి ప్రభాస్ దే. ఆ తర్వాత టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరో లు మహేష్ బాబు, అల్లు అర్జున్ విగ్రహాలు కూడా మేడం టుస్సాడ్స్ లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు మరో హీరో రామ్ చరణ్ కూడా ఈ ఘనత దక్కించుకున్నారు. ఈ విగ్రహంలో రామ్ చరణ్ తో పాటు ఆయన పెంపుడు కుక్క రైమికి కూడా చోటు దక్కటం విశేషం అని చెప్పాలి. రామ్ చరణ్ మైనపు విగ్రహం సింగపూర్ లోని మేడం టుస్సాడ్స్ లో ఏర్పాటు కానుంది. ఇప్పటికే అక్కడ టాలీవుడ్ కు చెందిన హీరో మహేష్ బాబు విగ్రహం ఉంది. అల్లు అర్జున్ మైనపు విగ్రహం దుబాయ్ లోని మేడం టుస్సాడ్స్ లో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

                                                             Full Viewటుస్సాడ్స్ కుటుంబంలో భాగం కాబోతున్నందుకు సంతోషంగా ఉంది అంటూ రామ్ చరణ్ తాజాగా స్పందించారు. మేడం టుస్సాడ్స్ కు చెందిన టీం ఇప్పటికే రామ్ చరణ్ కు సంబంధించిన కొలతలతో పాటు రైమి ఫోటో లు కూడా తీసుకున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ లో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇది పూర్తి కాగానే దర్శకుడు బుచ్చిబాబు తో కలిసి చేయనున్న సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. జాన్వీ కపూర్ తొలిసారి ఇటీవల విడుదల అయిన దేవర సినిమా తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News