శ్రీవిష్ణు. టాలీవుడ్ లో విలక్షణ పాత్రలు పోషిస్తున్న హీరో. ఇప్పుడు దొంగగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'రాజ రాజ చోర' అంటూ హంగామా చేయటానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా ఆగస్టు 19న థియేటర్లలో సందడి చేయనుంది. చాలా కాలం తర్వాత మేఘా ఆకాష్ ఈ సినిమాలో శ్రీవిష్ణుకు జోడీగా కన్పించనుంది.
మరో హీరోయిన్ గా సునైన నటిస్తోంది. హితేశ్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా టీజర్ చూస్తేనే సినిమా ఎంత సందడిగా ఉండనుందో తేలిపోయింది. శ్రీవిష్ణు తాజా చిత్రం గాలి సంపత్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఈ హీరో కొత్త సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు.