పవన్ కళ్యాణ్, రానాల కాంబినేషన్ కుదిరింది

Update: 2020-10-25 03:30 GMT

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్. పవర్ స్టార్ మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చూస్తుంటే పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో గతంలో కంటే జోరు పెంచినట్లే కన్పిస్తోంది. వరస పెట్టి సినిమాలు అంగీకరిస్తున్నారు. పవన్ కోసం మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రెడీ అయింది. అది కూడా మల్టీస్టారర్. దగ్గుబాటి రానాతో కలసి ఈ సినిమా చేయనున్నారు. మళయాళ సినిమా అయ్యప్పనుం... కోషియాంకు ఇది రీమేక్. సాగర్ చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కనుంది. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నే సినిమా విడుదల అయి మంచి టాక్ సాధించటమే కాకుండా భారీ వసూళ్ళు కూడా రాబట్టింది.

పవన్ కళ్యాణ్ గతంలోనూ దగ్గుబాటి వెంకటేష్ తో కలసి గోపాల..గోపాల సినిమా చేసి మంచి హిట్ దక్కించుకున్నారు. దీంతో ఇప్పుడు పవన్, రానాల కాంబినేషన్ పై ఆసక్తి నెలకొంది. దసరా పండగను పురస్కరించుకుని కొత్త సినిమా ప్రకటన వెలువడనుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేతిలో వకీల్ సాబ్ సినిమాతోపాటు ప్రముఖ దర్శకుడు క్రిష్ తో చేస్తున్న సినిమా, హరీష్ శంకర్ తో మరో సినిమా, సురేందర్ రెడ్డి సినిమాలు కమిట్ అయ్యారు. ఇప్పుడు ఇది మరో కొత్త సినిమాకు అంగీకరించటంతో వచ్చే రెండేళ్ళు సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేట్లు కన్పిస్తోంది.

Tags:    

Similar News