రవి తేజ లో అదే జోష్

Update: 2024-07-28 13:13 GMT

Full Viewఆగస్ట్ నెల అంతా ఫుల్ యాక్షన్ ధమాకానే. ఒకే రోజు అంటే ఆగస్ట్ 15 న రెండు హైప్ ఉన్న సినిమాలు రానున్నాయి. అందులో ఒకటి రవి తేజ మిస్టర్ బచ్చన్ అయితే...రెండవది రామ్ డబుల్ ఇస్మార్ట్. ఆదివారం నాడు మిస్టర్ బచ్చన్ సినిమా టీజర్ విడుదల అయింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి అనే చెప్పాలి. టీజర్ లోని పవర్ ఫుల్ డైలాగుల్లో దర్శకుడు హరీష్ శంకర్ మార్క్ ఉంది . ఈ సినిమాలో రవి తేజ కు జోడిగా టాలీవుడ్ లోకి భాగ్యశ్రీ బోర్సే ఎంట్రీ ఇస్తోంది. మిస్టర్ బచ్చన్ సినిమా లో రవి తేజ ఇన్ కం టాక్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు టీజర్ లో తేలిపోయింది. విలన్ గా జగపతి బాబు కనిపించబోతున్నారు. ఈ దేశాన్ని పీడిస్తున్నది దరిద్రం కాదు. నల్లధనం. నాలుగైదు రైడ్స్ చేయగానే సక్సెస్ వచ్చినట్లు ఉంది. దీంతో కళ్ళు నెత్తి మెడకు...తల తాటి చెట్టు మీదకు ఎక్కినట్లు ఉంది వంటి డైలాగులు టీజర్ లో ఉన్నాయి .

                                      సక్సెస్ ఫెయిల్యూర్స్ ఇంటికి వచ్చే చుట్టాలు లాంటివి. వస్తుంటాయి..పోతున్నాయి. యాటిట్యూడ్ ఇంటి పేరు లాంటిది. అది పోయేదాకా మనతోనే ఉంటుంది అంటూ రవి తేజ చెప్పే పవర్ ఫుల్ డైలాగు టీజర్ లో హై లైట్ గా చెప్పొచ్చు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ డోస్ కూడా బాగానే ఉన్నట్లు టీజర్ చూస్తే కనిపిస్తోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ను పెంచి టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. మిస్టర్ బచ్చన్ ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 15 న విడుదల అవుతుంటే...ఆగస్ట్ 14 నే ప్రీమియర్స్ వేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

Tags:    

Similar News