ప్రభాస్ విరాళం కోటి రూపాయలు

Update: 2020-10-20 15:17 GMT

తెలంగాణలో వరద నష్టానికి సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి హీరో ప్రభాస్ కోటి రూపాయల విరాళం ప్రకటించారు. తెలంగాణ లో గత కొన్ని రోజులుగా విడవకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎన్నో ప్రాంతాలు పూర్తిగా నీట మునిగి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి సహాయార్ధం రెబల్ స్టార్ ప్రభాస్ తెలంగాణ సీఎం సహయనిధి కి తన వంతు సాయంగా కోటి రూపాయల విరాళం ప్రకటించారు. చిరంజీవి, మహేష్ బాబులు కడా చెరో కోటి రూపాయల విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News