విశ్వక్ సేన్, కయాదు లోహర్ జంటగా నటిస్తున్న సినిమా ఫంకీ. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకోగా... సెన్సార్ బోర్డు ఈ మూవీకి యూఏ సర్టిఫికెట్ మంజూరు చేసింది. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కె వి తెరకెక్కించిన ఈ మూవీ పై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. టీజర్ దగ్గర నుంచి ట్రైలర్ వరకు ఫంకీ మూవీ ఎంత సరదాగా సాగనుందో స్పష్టత ఇచ్చాయి అనే చెప్పాలి. చిత్ర యూనిట్ కూడా ఈ సినిమాలో కథ కంటే కూడా ప్రేక్షకులను రెండు గంటల పాటు నవ్వించటమే లక్ష్యంగా తెరకెక్కించినట్లు అధికారికంగా వెల్లడించింది. సెన్సార్ రిపోర్ట్ ప్రక్రారం ఈ సినిమా నిడివి రెండు గంటల ఎనిమిది నిమిషాలు మాత్రమే. ఫంకీ మూవీ ఫిబ్రవరి 13 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.