నాకు ఇష్టమైతే...నచ్చితేనే వస్తా

Update: 2024-08-22 04:00 GMT

గత అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి మొదలైన మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య వివాదం అలా కొనసాగుతూనే ఉంది. అప్పుడప్పుడు దీనికి బ్రేక్ వచ్చినా నిత్యం ఎవరో ఒకరు తమ వ్యాఖ్యల ద్వారా ఈ వివాదాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం బెంగళూరు లో పర్యటించిన జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎవరూ ఊహించని రీతిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను టార్గెట్ చేశారు. ఒకప్పుడు హీరో లు అడవులను కాపాడేలా సినిమాలు చేసే వాళ్ళు అని...కానీ ఇప్పుడు అడవుల్లో చెట్లు కొట్టి ..స్మగ్లింగ్ చేస్తూ హీరో లు సినిమాలు చేస్తున్నారు అంటూ కామెంట్ చేశారు. దీంతో సహజంగానే ఇది అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాను టార్గెట్ చేసుకుని చేసిందే అన్న అభిప్రాయం వ్యక్తం అయింది. గత ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కోసం కేవలం ట్వీట్ చేసి..వైసీపీ అభ్యర్థి కోసం అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసి నంద్యాల వెళ్లి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతు పలికారు. ఇది అప్పటిలో పెద్ద సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

                                                    తాజాగా అల్లు అర్జున్ మరో సారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇష్టమైన వాళ్లకు మనం చూపించాలి. మనం నిలబడాలి. మన ఫ్రెండ్ అనుకో..ఇంకొకరు అనుకో...మనకు కావాల్సిన వాళ్ళు అనుకో..నా కిష్టమైతే నేను వస్తా...నా మనసుకు నచ్చితే నేను వస్తా అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలతో తాను ఎవరి పక్కన ఉండబోతుంది క్లారిటీ ఇచ్చారు అనే చర్చ కూడా సాగుతోంది. సుకుమార్ భార్య తబిత సుకుమార్ సమర్పిస్తున్న సినిమా మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న అల్లు అర్జున్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇవి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకుని చేసినవే అనే చర్చ సాగుతోంది. పుష్ప 2 విడుదల డిసెంబర్ 6 నే ఉంటుంది అని స్పష్టత ఇచ్చారు. ఈ సమయంలో అల్లు అర్జున్ మరో సారి వివాద స్పద వ్యాఖ్యలు చేయటంతో దీనిపై పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News