భారీ అంచనాల మధ్య డిసెంబర్ 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ 2 తాండవం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్మురేపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసిన ప్రీమియర్స్ తో కలుపుకుని ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 59 . 5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన నాల్గవ సినిమా ఇది. గత మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలవటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అఖండ 2 తాండవం మూవీ కి రివ్యూ ల్లో మిశ్రమ స్పందన వ్యక్తం అయినా కూడా కలెక్షన్స్ ఆశాజనంగానే ఉన్నాయని చిత్ర యూనిట్ చెపుతోంది.