భీమ్లా నాయక్‌ పాట విడుద‌ల‌

Update: 2021-12-04 08:32 GMT

Full Viewమ‌రో పాట వ‌చ్చింది. బీమ్లా నాయ‌క్ నుంచి నాల్గ‌వ సింగిల్ ను చిత్ర యూన‌నిట్ విడుద‌ల చేసింది. పవర్‌ స్టార్‌ పవన్‌ కల‍్యాణ్‌, రానా దగ్గుబాటి మల్టీసారర్‌గా వస్తున్న చిత్రం సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఈ సినిమాకు సాగర్‌ కె చంద్ర దర్శకత్వ వహించగా తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాకు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైలాగ్స్‌ రాస్తున్న సంగతి తెలిసిందే. 'అడవి తల్లి మాట' పాటను డిసెంబర్‌ 1న విడుదల చేయాల్సింది. అక్షరయోధుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతికి సంతాపంగా ఆ పాట రిలీజ్‌ను ఆపారు.

డిసెంబర్‌ 4, శనివారం ఉదయం 10.08 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. చెప్పినట్టే ఇవాళ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ 'అడవి తల్లి మాట' పాటను రామజోగయ్య శాస్త‍్రి రచించారు. దుర్గవ్వ, సాహితి చాగంటి తమదైన గాత్రంతో పాడి ఆకట్టుకున్నారు. మలయాళంలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన 'అయ్యప్పనుమ్‌ కోషియమ్‌' సినిమాకు తెలుగు రీమేక్‌గా 'భీమ్లా నాయక్‌' తెరకెక్కుతున్న విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News