జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల షెడ్యూల్ విడుదల

Update: 2021-04-01 15:13 GMT

ఏప్రిల్ 8న ఎన్నికలు..10న ఫలితాలు

ఏపీలో మరో ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. ఆగిపోయిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి గురువారం నాడే బాధ్యతలు స్వీకరించిన నూతన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నీలం సాహ్ని ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్నికల నిర్వహణ అంశంపై ఆమె జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తోపాటు డీజీపీ గౌతం సవాల్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.

ఎన్నికల సన్నద్ధతపై సమావేశం ముగిసిన తర్వాత ఆమె ఎక్కడ అయితే ఈ ఎన్నికల ప్రక్రియ ఆగిపోయిందో అక్కడ నుంచే మొదలుపెడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. దీని ప్రకారం ఏప్రిల్ 8న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎక్కడైనా అవసరం అయితే ఏప్రిల్ 9న రీపోలింగ్ నిర్వహిస్తారు. ఏప్రిల్ 10న కౌంటింగ్ జరగనుంది. కోర్టులో పెండింగ్ లో ఉన్న ఓ స్థానానికి కూడా ఎన్నిక ఉండదని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం గతంలో ఏకగ్రీవాలు అయిన వాటిని అలాగే కొనసాగించనున్నారు.

Tags:    

Similar News