ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ వారికి బీఫామ్ పత్రాలను అందజేశారు. ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు గురువారం నామినేషన్లు వేశారు. వైసీపీ తరపున ఇఫ్పటికే పార్టీ అధిష్టానం ఇక్బాల్, కరీమున్నీసా, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, చల్లా భగీరథ, దువ్వాడ శ్రీనివాస్, సి.రామచంద్రయ్య పేర్లను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.ఐదు సాధారణ ఖాళీలు రాగా, ఒక స్థానానికి ఉపఎన్నిక జరగనుంది.