భార‌త్ బంద్ కు వైసీపీ మ‌ద్ద‌తు

Update: 2021-09-25 12:40 GMT

 ఏపీలో అధికార వైసీపీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వ్యవసాయ చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలకు వ్యతిరేకంగా తలపెట్టిన భారత్‌ బంద్‌కు వైసీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బంద్‌లో భాగంగా 26వ తేదీ అర్ధరాత్రి నుంచి 27వ తేదీ 1 గంట వరకు ఆర్టీసీ బస్సులు నడవవు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని మంత్రి పేర్ని నాని కోరారు. రైతు సంఘాలు శాంతియుతంగా బంద్‌లో పాల్గొనాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కును కార్పోరేట్‌ శక్తులకు అమ్మొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం' అని పేర్ని నాని పేర్కొన్నారు. 

Tags:    

Similar News