త్వరలో శాటిలైట్ ఛానెల్ కూడా !

Update: 2026-04-11 09:11 GMT

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా శనివారం నాడు కీలక ప్రకటన చేశారు. త్వరలోనే తాను తెలుగు తో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఒక డిజిటల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఇది నిష్పక్షపాతంగా...ఎవరివైపు మొగ్గుచూపకుండా ప్రజలకు కేవలం నిజాలు మాత్రమే చెపుతుంది అని తన పోస్ట్ లో పేర్కొన్నారు. ప్రజల గొంతుక వినిపించటమే తమ ద్యేయం అన్నారు. సామాన్య ప్రజలతో పాటు మహిళలు, రైతులు, కార్మికులు, సమాజంలో వెనకబడిన వివిధ వర్గాల గొంతుకగా ఉండటమే తమ లక్ష్యం అన్నారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఈ ఫ్లాట్ ఫార్మ్ స్వతంత్రంగా ఉంటుంది అని తెలిపారు. డిజిటల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ప్రారంభించిన తర్వాత తెలుగులో శాటిలైట్ ఛానెల్ కూడా ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే తమ డిజిటల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ పేరును వెల్లడిస్తామన్నారు.

                                  Full Viewఎప్పటి నుంచో విజయసాయిరెడ్డి ఒక ఛానెల్ పెడతారు అనే ప్రచారం మీడియా సర్కిల్స్ తో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఆయనే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఎంపీ పదవికి రాజీనామా చేసిన సమయంలో తాను ఇక ఏ పార్టీ లో చేరను అని...ప్రకృతి వ్యవసాయంపైనే ఫోకస్ పెడతాను అని ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయసాయి రెడ్డి బీజేపీ లో చేరే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా జోరుగా సాగింది. ఇప్పుడు ఆయన మీడియా రంగంలోకి ప్రవేశిస్తూ తెలుగు తో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో డిజిటల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ఏర్పాటు చేస్తున్నారు అంటే ఇది రాజకీయ కోణంలో తీసుకున్న నిర్ణయం గా ఉంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News