ప‌వ‌న్ అప్పుడెందుకు శ్ర‌మ‌దానం చేయ‌లేదు?

Update: 2021-10-02 12:46 GMT

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై అధికార వైసీపీ విరుచుకుప‌డింది. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామకృష్ణారెడ్డి, ప‌లువురు మంత్రులు ప‌వ‌న్ పై ఎటాక్ చేశారు. టీడీపీ ఐదేళ్లలో ఒక్క రోడ్డు కూడా వేయలేదని, పవన్‌ ఆనాడు ఏమయ్యారు? అప్పుడు ఎందుకు శ్రమదానం చెయ్యలేదు అంటూ సజ్జల రామ‌క్రిష్ణారెడ్డి ప్ర‌శ్నించారు. కోవిడ్‌ నిబంధనలు అందరికీ సమానమేన‌ని, ప్రజల ఆరోగ్యం కోసమే నిబంధనల‌న్నారు. ఇలాంటి సమయంలో బలప్రదర్శన వల్ల ఇబ్బంది పడేది ప్రజలే అని తెలిపారు.

అక్టోబర్‌లో కోవిడ్‌ పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు చెప్తున్నార‌ని, పవన్‌ టూర్‌ని ఆపాల్సిన అవసరం ప్రభుత్వానికి లేద‌న్నారు. రోడ్ల గుంతలు మీరు పూడ్చడం ఏమిటి?. అందుకు సీఎం జగన్‌ రూ.2,200 కోట్లు కేటాయించారు. వర్షాలు తగ్గగానే రోడ్లు మరమ్మత్తులు చేస్తాం. ఈలోపు టెండర్ల ప్రక్రియ జరుగుతుంది. టీడీపీ హయాంలో రూ.800 కోట్లు ఇచ్చారు. వాళ్లు బిల్లులు ఇవ్వకపోతే మేము ఇచ్చామ‌న్నారు.

Tags:    

Similar News