ప‌వ‌న్, టీడీపీ, బిజెపి క‌లిసినా జ‌గ‌నే గెలుస్తారు

Update: 2021-09-30 13:23 GMT

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌ల‌పై ఏపీ మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్, టీడీపీ, బిజెపి క‌లిసినా కూడా జ‌గ‌నే గెలుస్తార‌ని అన్నారు. జ‌గ‌న్ ను ఓడిస్తే తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని ప్ర‌క‌టించారు. కొడాలి నాని గురువారం నాడు మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ జీవితంలో వైసీపీని ఓడించలేడన్నారు. ''నువ్వు సీఎం వైఎస్‌ జగన్‌ని మాజీ ముఖ్యమంత్రిని చేస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. నువ్వు ముందు ఎమ్మెల్యేగా గెలుస్తావో లేదో చూస్కో. 2024 లో నువ్వు ఏం చేస్తావో చూద్దాం.

చంద్రబాబు, బీజేపీ, కాంగ్రెస్‌తో కలిసి రా. చూసుకుందాం'' అంటూ నాని పవన్‌కు సవాలు చేశారు. ''పవన్‌ కల్యాణ్‌ ఏంటి మమ్మల్ని భయపెట్టేది. ఇంకో జానీ సినిమా చూపించి భయపెడతారా. పవన్‌ని చూసి ఆయన అభిమానులు భయపడతారు. పవన్‌ స్పీచ్‌లకి జనం భయపడతారు. జగన్‌మోహన్‌రెడ్డి ఆ రోజు సోనియాగాంధీకే భయపడలేదు. అలాంటిది చంద్రబాబు ఇచ్చే స్క్రిప్టులు చదివి పవన్‌ కల్యాణ్‌ మమ్మల్ని భయపెడతారా'' అని నాని ప్రశ్నించారు. 

Tags:    

Similar News