చంద్రబాబులాగా వైసీపీలో వెన్నుపోట్లు ఉండవు

Update: 2020-11-15 11:55 GMT

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో వెన్నుపోట్లు ఉండవన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టి జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ సీఎంగా ఉండటం కొంత మందికి ఇబ్బందిగా మారిందని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో ఇష్టం వచ్చినట్లు రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. ఓ బోగస్‌ న్యూస్‌ ఛానల్ ‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు లాంటి వెన్నుపోటు కార్యక్రమాలు వైసీపీ జరగవు అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ రెక్కల కష్టంతో ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు. వెన్నుపోటుతో మామను చంపి అందలం ఎక్కిన చంద్రబాబుకు ఆందరూ తనలాగే ఉంటారని భావిస్తున్నాడు. సీఎం జగన్‌ ప్రజల కోసం పార్టీ పెట్టి కష్టపడి ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి.

ఆయనను సీఎం నుంచి దించేస్తే ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో ఏం జరిగిందో ప్రజలకు తెలుసు. చంద్రబాబుకు రామోజీ రావు, రాధాకృష్ణ డైరెక్షన్ ఇచ్చి నడిపిస్తారు. డబ్బా ఛానెళ్ళు ద్వారా అసత్య ప్రచారాలు చేసినా ఉపయోగం లేదు. ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏం కావాలో సీఎం జగన్‌కు తెలుసు. ఆయనకు ఏం కావాలో ప్రజలకు తెలుసు. రామోజీ రావు, రాధాకృష్ణ, బిఅర్ నాయుడు, చంద్రబాబు ఎంత మంది కుట్ర దారులు వచ్చినా సీఎం వైఎస్‌ జగన్‌ను ఏం చేయలేరు. చంద్రబాబు పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎల్లో మీడియా పెద్దలు కోట్ల రూపాయల ప్రజాసొమ్ము కొల్లగొట్టారు. సచ్చే ముందు అయినా ఆ దుష్ట చతుష్టయం చిల్లర పనులు మానుకోవాలన్నారు.

Tags:    

Similar News