సందర్శకులు..పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చే ప్రదేశాల్లో బీచ్ లు ముందు వరసలో ఉంటాయి. కుటుంబ సభ్యులతో సహా అందరూ కలిసి సముద్ర తీరంలో సేద తీరుతుంటారు. ఇంతటి రద్దీ ఉండే ప్రాంతాల్లో ఏకంగా మద్యం విక్రయాలకు ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ బీచ్ షాక్స్ (తాత్కాలికంగా నిర్మించే గుడిసెలు) ముందు వైజాగ్ బీచ్ తో పాటు చీరాల బీచ్ ల్లో అమలు చేయనున్నారు. తర్వాత దీన్ని మరిన్ని బీచ్ లకు విస్తరిస్తారు. ఈ మేరకు గురువారం నాడు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అద్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇవి ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటాయి. బీచ్ షాక్స్ ఏర్పాటుకు వీలుగా ఆంధ్ర ప్రదేశ్ ఎక్సయిజ్ పోలీస్ లో మార్పులు చేయటానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.