పోల‌వ‌రం ప‌నుల‌ను ప‌రిశీలించిన‌ జ‌గ‌న్

Update: 2021-07-19 08:27 GMT

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోమ‌వారం నాడు పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల పురోగ‌తిని ప‌రిశీలించారు. తొలుత ఆయ‌న ఏరియ‌ల్ స‌ర్వే ద్వారా ప‌రిశీలించారు. త‌ర్వాత అధికారుల‌తో స‌మావేశం ప‌నులు సాగుతున్నతీరును అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్ట్ పనుల పురోగతిని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.అనంతరం సీఎం జగన్‌ పోలవరం నిర్వాసితులతో మాట్లాడారు. స్పిల్‌వే, అప్రోచ్ ఛానల్‌ను సీఎం వైఎస్ జగన్‌ పరిశీలించారు. గడువులోగా పోలవరం పనులు పూర్తిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు. 

Tags:    

Similar News