గురుమూర్తికి జగన్ అభినందనలు

Update: 2021-05-02 15:25 GMT

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తికి సీఎం జగన్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనలు విడుదల చేశారు. ''23 నెలల పాలన తర్వాత తిరుపతి పార్లమెంట్‌కు జరిగిన ఉపఎన్నికలో ప్రజలు మన ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. తిరుపతి పార్లమెంట్ ఓటర్లు 2019 ఎన్నికల్లో 2.28 లక్షల మెజార్టీతో దీవించారు.

మనందరి ప్రభుత్వం చేసిన మంచిని మనసారా దీవించి.. నన్ను, మన ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తూ.. ఈ రోజు 2.71 లక్షల మెజార్టీతో ఆశీర్వదించారు. వారు మనపై చూపించిన అభిమానం, గౌరవం ఎంతో గొప్పది. ఈ విజయం నా బాధ్యతను మరింతగా పెంచుతుంది. దేవుని దయ, మీ అందరి చల్లని దీవెనలతోనే ..ఈ విజయం సాధ్యమైంది అని సీఎం జగన్‌ తెలిపారు.

Tags:    

Similar News