నామినేటెడ్ ఎమ్మెల్సీ పోస్టుల‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం

Update: 2021-06-14 13:53 GMT

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో నాలుగు నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పదవులకు సోమ‌వారం నాడు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపారు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా తోట త్రిమూర్తులు, రమేష్‌ యాదవ్‌, లేళ్ల అప్పిరెడ్డి, మోషేన్‌రాజు పదవులు చేపట్టనున్నారు. గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్ హ‌రిచంద‌న్ తో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భేటీ అనంత‌రం ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌కు లైన్ క్లియ‌ర్ అయింది. కొంత మంది పేర్ల‌పై గ‌వ‌ర్న‌ర్ అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చినా..ప్ర‌భుత్వం పంపిన అన్ని పేర్ల‌కూ ఆయ‌న ఆమోదం తెలిపారు.

Tags:    

Similar News