జగనన్న కరోనా కేర్ అని పెట్టుకోండి..కానీ!

Update: 2020-07-27 10:24 GMT

సీఎం జగన్ పై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యంగాస్త్రాలు సంధించారు. ప్రతి పథకానికి తన పేరు పెట్టుకోవటం సీఎం జగన్ కు అలవాటు అయిందని ఎద్దేవా చేశారు. అలాగే కరోనాకు సంబంధించి కూడా జగనన్న కరోనా కేర్ అని పెట్టుకోండి కానీ..ప్రజలకు ప్రయోజనం చేకూర్చే పనులు చేయాలని సూచించారు. ఢిల్లీలో రఘురామకృష్ణంరాజు సోమవారం నాడు మీడియాతో మాట్లాడారు. కరోనా కట్టడి విషయంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు.

దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని..వెంటిలేటర్లు ఉన్న బెడ్స్ కూడా పరిమిత సంఖ్యలోనే ఉన్నాయని తెలిపారు. ఒక వ్యక్తిని చెత్త వ్యాన్ లో కరోనా కేంద్రానికి తీసుకెళ్లారని తెలిసి సిగ్గుపడుతున్నానని వ్యాఖ్యానించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాగా ఆయన మోడల్ ఫాలో అయి కరోనాను నియంత్రించే చర్యలు తీసుకోవాలని సూచించారు.

Similar News