ఏపీ సీఎం జగన్ పై పవన్ పశ్రంసలు

Update: 2020-07-03 12:23 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. ఏపీలో సాగుతున్న కరోనా టెస్ట్ లు, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 108 వాహనాల ప్రారంభోత్సవంపై ఆయన స్పందించారు. ఈ మేరకు శుక్రవారం నాడు ట్వీట్ చేశారు. ‘అత్యవసర పరిస్థితుల్లో అత్యవసర సేవలు అందించే అంబులెన్స్ లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించటం అభినందనీయం. గత మూడు నెలలుగా కరోనా టెస్ట్ ల విషయంలోనూ ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా ప్రభుత్వం పనిచేస్తున్న తీరు అభినందనీయం’ అని పవన్ కళ్యాణ్ ట్వీట్ లో పేర్కొన్నారు.

Similar News