ఏపీని నాలుగు గ్రహణాలు పట్టాయి

Update: 2020-06-26 16:50 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కుల పోరాటాలు తప్ప ప్రజల భాగస్వామ్యం ఉండటం లేదని విమర్శించారు. ఏపీకి రాజకీయంగా నాలుగు గ్రహణాలు పట్టాయని అన్నారు. ఎన్టీఆర్‌, చంద్రన్న, వైఎస్సార్‌, జగనన్న.. వీరేనా మహానాయకులు? అని ప్రశ్నించారు. దేశంకోసం ప్రాణాలు అర్పించిన ప్రకాశం, వీరేశలింగం కనిపించరా అని నిలదీశారు.

కుటుంబ రాజకీయాల కోసం ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెడతారా? అని ప్రశ్నించారు. రెండు ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని, అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామని అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఆ దిశగా చర్యలు చేపట్టలేదని తప్పుబట్టారు. ఇసుక మాఫియా పేరుతో దోచుకుంటున్నారని, అవినీతి నిర్మూలన అనేది రాజకీయ కోణంలోనే వాడుకుంటున్నారని ఆరోపించారు.

Similar News