‘అడ్డమైన విషయాలపై జూమ్ లో మాట్లాడే మీకు..ఈ నెల 5న విడుదలైన జీవోపై మాట్లాడేందుకు వారం దాటినా మనసు రాలేదా?. మీరు రాయలసీమ బిడ్డేనా? మీరు ఏపీ వారేనా?’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన బుధవారం నాడు ట్వీట్ చేశారు. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని పంపించే జీవో 203పై మీ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.