లాక్ డౌన్ ను మే 17 వరకూ పొడిగించిన కేంద్రం ఈ సారి పలు మినహాయింపులు ఇచ్చింది. ముఖ్యంగా గ్రీన్ జోన్లు, ఆరేంజ్ జోన్లలో ఆంక్షలను సడలించారు.
గ్రీన్ జోన్లలో మద్యం విక్రయాలకు కూడా అనుమతి
మద్యం షాపు వద్ద 5 గురికి మించకుండా ఉండాలి
మద్యం షాపుల వద్ద భౌతిక దూరం తప్పకుండా పాటించాలి
అన్ని జోన్లలో ఆస్పత్రులలో ఓపీ సేవలకు అనుమతి.
వారంకు ఒకసారి రెడ్ జోన్లలో పరిస్థితి పరిశీలన.
కేసులు తగ్గితే రెడ్ జోన్లను గ్రీన్ జోన్లుగా మార్పు.
రాష్ట్రాల పరిధిలో బస్సులకు అనుమతిచ్చిన ప్రభుత్వం.
గ్రీన్ జోన్లలో 50 శాతం సామర్ధ్యంతో బస్సులకు ఓకే
ఆరెంజ్ జోన్లలో వ్యక్తిగత వాహనాలకు అనుమతి.