త్వరలో టాలీవుడ్ ప్రముఖులతో జగన్ భేటీ

Update: 2020-05-24 12:57 GMT

ఏపీ ప్రభుత్వం ఇటీవలే సినీ పరిశ్రమకు సంబంధించిన అనుమతులు అన్నీ సింగిల్ విండో విధానంలో ఇచ్చేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమకు ఎంతో మేలు చేసే నిర్ణయం తీసుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి ఆదివారం నాడు ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారు. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు కలుద్దామని సీఎం జగన్ చెప్పారని, అన్ని విభాగాల ప్రతినిధులతో త్వరలోనే ముఖ్యమంత్రిని కలుస్తామని ట్విటర్‌ వేదికగా చిరంజీవి ప్రకటించారు.

Similar News