ఏపీలో కరోనా కేసులు 161

Update: 2020-04-03 05:10 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం ఉదయం వరకూ వెల్లడైన ఫలితాల్లో కొత్తగా 12 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 161కి పెరిగింది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కృష్ణా జిల్లాలో 23, గుంటూరు జిల్లాలో 20, కడపలో 19 కేసులు, ప్రకాశంలో 17, విశాఖపట్నంలో 14, పశ్చిమ గోదావరిలో 15, తూర్పుగోదావరి, చిత్తూరుల్లో తొమ్మిదేసి చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Similar News