ఏపీలో 111కి చేరిన కరోనా కేసులు

Update: 2020-04-01 16:48 GMT

ఏపీలో బుధవారం నాడు ఒక్క రోజే 67 కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఉదయం 43 కేసులు పాజిటివ్ గా తేలగా..సాయంత్రం కొత్తగా మరో 24 కేసులు పాజిటివ్ గా వచ్చినట్లు ఏపీ రాష్ట్ర నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఏడు గంటల తర్వాత వెల్లడైన ల్యాబ్ ఫలితాల్లో 24 కేసులు రావటంతో ఏపీలో మొత్తం ఈ కేసుల సంఖ్య 111కి చేరింది. ప్రస్తుతం గుంటూరులో అత్యధికంగా 20 పాజిటివ్ కేసులు ఉండగా, కడప, కృష్ణా జిల్లాల్లో పదిహేను కేసుల చొప్పున ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో 15, పశ్చిమ గోదావరి లో 14, విశాఖపట్నంలో 11 కేసులు నమోదు అయ్యాయి.

Similar News