ఏపీలో టెన్త్ పరీక్షలు వాయిదా

Update: 2020-03-24 06:50 GMT

ఏపీలో పదవ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. వాస్తవానికి ఈ పరీక్షలు మార్చి 31 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలను రెండు వారాల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఏపీలో కూడా కరోనా కేసులు పెరుగుతుండటంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. రెండు వారాల తర్వాత సమీక్ష నిర్వహించి పరీక్షల తేదీలు ఎప్పుడు అనేది ప్రకటిస్తారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించటం....దేశంలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Similar News