తెలంగాణలో కోలుకున్న 11 మంది కరోనా బాధితులు

Update: 2020-03-29 12:16 GMT

ఓ వైపు తెలంగాణలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ కలకలం రేపుతున్న తరుణంలో ఓ సానుకూల వార్త. కరోనా బాధితుల్లో పదకొండు మంది కోలుకున్నారని..వీరి నివేదికల్లో కరోనా నెగిటివ్ వచ్చిందని పురపాలక శాఖ మంత్రి కెటీఆర్ తెలిపారు. ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఈ ఫలితాలు వెల్లడయ్యాయన్నారు. ఇది చాలా మంచి పరిణామం అన్నారు మరోవైపు భవిష్యత్ లో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొనేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది.

Similar News