ఈఎంఐల చెల్లింపులను వాయిదా వేయాలి

Update: 2020-03-26 15:51 GMT

దేశాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్న తరుణంలో పేదలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. విపత్కర తరుణంలో ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకొనేలా ఈ ప్యాకేజీ ఉంది అని చెప్పారు. అదే సమయంలో ఉద్యోగ వర్గాలకు, స్వయం ఉపాధి పొందేవారికి ఉపశమనం కలిగించేలా నెలవారీ ఈ.ఎమ్.ఐ. చెల్లింపులను జూన్ వరకూ వాయిదా వేయడాన్ని పరిశీలించాలని పవన్ కల్యాణ్ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో రాష్ట్ర సరిహద్దులు... మార్కెట్లు మూసివేయడంతో మామిడి రైతుల్లో నష్టాల పాలవుతామనే తీవ్ర ఆందోళన నెలకొని ఉందన్నారు.

వారిని ఆదుకొనే దిశగా వైసీపీ నేతృత్వంలోని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ మేరకు గురువారం రాత్రి ట్విట్టర్ ద్వారా ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ స్వయం సహాయక సంఘాల రుణాల చెల్లింపును జూన్ వరకూ వాయిదా వేసి ఆ సంఘాల సభ్యురాళ్ళ వేదనను తగ్గించాలన్నారు. ఈ విపత్కర సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన అండగా ఉంటుందని తెలిపారు.

 

 

Similar News