పీ వీ సింధుతో పెళ్ళి కోసం పిటీషన్!

Update: 2019-09-17 09:56 GMT

పీ వీ సింధు. చరిత్ర సృష్టించిన తెలుగు తేజం. ప్రపంచ ఛాంపియన్ షిప్ అందించిన క్రీడాకారిణి. ఈ పతకంతో ఆమె ప్రతిష్ట మరింత పెరిగింది. దేశ ప్రజలు ఆమెకు జై జైలు పలికారు. ఇదంతా ఆటకు సంబంధించి. ఇప్పుడు సింధుకు ఓ కొత్త సమస్య వచ్చిపడింది. అదేంటి అంటే ఓ డెబ్బయి సంవత్సరాల వ్యక్తి సింధుతో తనకు పెళ్ళి చేయాలని ఏకంగా కలెక్టర్ కు దరఖాస్తు పెట్టుకున్నాడు. కానీ దరఖాస్తులో మాత్రం తన వయస్సు కేవలం పదహారు సంవత్సరాలుగా చూపించాడు. ఒకవేళ సింధుతో పెళ్లి చేయకపోతే ఆమెను కిడ్నాప్‌ చేసేందుకు కూడా సిద్ధమని పేర్కొన్నాడు. ఈ విచిత్ర సంఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన మలైస్వామి అనే వృద్ధుడు.. పీవీ సింధుతో వివాహం చేసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు పిటిషన్‌ పెట్టుకున్నాడు.

సింధును పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాని, వివాహానికి అవసరమైన ఏర్పాట్లు చేయకుంటే ఆమెను అపహరించి అయినా పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా మలైస్వామి మాట్లాడుతూ సింధు ఆటతీరు తనను ఎంతో ఆకట్టుకుందని, ఆమెను తన జీవిత భాగస్వామిని చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నానంటూ ఇద్దరి ఫోటోలను (సింధు, మలైస్వామి) జతచేసి కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నాడు. ఈ వింత అభ్యర్థనపై కలెక్టర్‌తో పాటు విషయం తెలిసినవాళ్లంతా షాక్ కు గురయ్యారు.

 

 

Similar News