అల్లు శిరీష్ నటిస్తున్న కొత్త సినిమా విడుదలకు రెడీ అయింది. చాలా గ్యాప్ తర్వాత ఈ హీరో చేస్తున్న సినిమా కావటంతో అందరితో ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని ‘క్లీన్ యూ’ సర్టిఫికెట్ దక్కించుకుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఇది ఆదరిస్తుందని చెబుతున్నారు. అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన సినిమానే ఏబీసీడీ’. ‘అమెరిక్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి’ అన్నది ఉపశీర్షిక. ఈ చిత్రంతో సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మించిన ఈ చిత్రాన్ని ఈనెల 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ‘‘ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. అమెరికా నుంచి ఇండియా వచ్చిన ఎన్నారై పాత్రలో అల్లు శిరీష్, అతని స్నేహితుడి భరత్ నటన ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.