ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రపై టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శలు చేశారు. రోజుకు ఎనిమిది కిలోమీటర్లు నడిస్తే కూడా దాన్ని పాదయాత్ర అంటారా? అని ప్రశ్నించారు. పాదయాత్ర అంటే నిబద్ధతతో చేయాలని..తాను గతంలో ఆరోగ్యం సహకరించకపోయినా పాదయాత్ర చేసినట్లు తెలిపారు.
తన పాదయాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ వచ్చిందని..వారి మనసుల్లో తనకు స్థానం దక్కిందని అన్నారు. పాదయాత్ర సమయంలో వచ్చిన కాలునొప్పి తననూ ఇంకా బాధిస్తుందని పేర్కొన్నారు. జగన్ ఎప్పుడైనా రాత్రి ఏడు గంటల తర్వాత పాదయాత్ర చేశారా? అని ప్రశ్నించారు.