ఆయన దుబాయ్ లో ఐఫోన్ 14 ప్రో మోడల్ ను..సెప్టెంబర్ 16న కొనుగోలు చేశాడు. అదే రోజు భారత్ లోనూ ఫోన్ విడుదల అయింది. ఈ 28 సంవత్సరాల వ్యాపారవేత్త మిర్డిఫ్ సిటీ సెంటర్ లో భారత్ లో విడుదల అయ్యే కొద్ది గంటల ముందే కొనుగోలు చేశాడు. ఆయనకు దుబాయ్ వెళ్లి కొత్తగా విడుదల అయ్యే ఐ ఫోన్లు కొనుగోలు చేయటం ఓ సరదా. 2017లో తొలిసారి ఇలా చేశాడట. గతంలో అయితే భారత్ లో విడుదల కావటానికి కొన్ని వారాల ముందే దుబాయ్ లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చేదని.. ఇప్పుడు రెండు దేశాల్లో ఇంచుమించు ఒకే సమయంలోనే ఫోన్ విడుదల అయినా దుబాయ్ వెళ్లి ఫోన్ కొనుగోలు చేయటం తనకు ఓ ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని చెబుతున్నాడు ధీరజ్. ఇలాంటి వాళ్లను చూసే ఎవరి పిచ్చి వాళ్ళకు ఆనందం వంటి సామెత పుట్టుకొచ్చి ఉంటుంది.