సీఎం కేసీఆర్ కు మోడీ అభినందనలు

Update: 2021-05-09 16:03 GMT

కరోనా నియంత్రణకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ చేసిన సూచనలను ప్రధాని మోడీ స్వాగతించారు. అదే సమయంలో అభినందనలు తెలిపారు. కరోనా పై సమీక్షా సమావేశానంతరం సిఎం కెసిఆర్ తో ప్రధాని నరేంద్ర మోడీ ఫోను కాల్ లో మాట్లాడారని సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. సమీక్ష సందర్భంగా సిఎం చేసిన సూచనలను కేంద్ర మంత్రి హర్షవర్దన్ తనకు వివరించారని ప్రధాని సిఎంకు తెలిపారు. '' మీది మంచి ఆలోచన, మీ సూచనలు చాలా బాగున్నాయి.

వాటిని తప్పకుండా ఆచరణలో పెడుతాం..మీ సూచనలకు అభినందనలు' ' అంటూ ప్రధాని సిఎం కెసిఆర్ ను అభినందించారు. రాష్ట్రానికి మరింతగా ఆక్సీజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు సరఫరా చేయాలని సిఎం కెసిఆర్ ప్రధానికి ఈ సందర్భంగా విజ్జప్తి చేశారు. సిఎం చేసిన విజ్జప్తికి ప్రధాని సానుకూలంగా స్పందించారు. అందుకు సంబంధించి సత్వరమే చర్యలు చేపడతామని సిఎం కు హామీ ఇచ్చారు.

Tags:    

Similar News