ఏకనాథ్ షిండే కామెంట్స్ ఇలా ఉంటే..ఉద్దవ్ ఠాక్రే గ్రూప్ కు చెందిన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన పేరు, విల్లు బాణం గుర్తు షిండే గ్రూప్ కు దక్కటం వెనక 2000 కోట్ల రూపాయల డీల్ జరిగింది అని ప్రకటించారు. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే అన్నారు. ఇది పక్క సమాచారం అని..దీనికి సంబంధించి త్వరలో వివరాలు బయటకు వస్తాయన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు అన్నారు. అయితే ఈ ఆరోపణలను షిండే వర్గం తోసిపుచ్చింది. ఒక వైపు అమిత్ షా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని సీఎం చెపుతుంటే....మరో వైపు సంజయ్ రౌత్ ఆరోపణలు రాజకీయ వేడి రాజేశాయి.